తిరుమల: చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఆళ్ల నాని గురువారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన తిరుపతి కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
స్విమ్స్లో వైద్యసేవలు చాలా బాగున్నాయి..
స్విమ్స్లో వైద్యసేవలు చాలా బాగున్నాయని, మంచి ఆహారం అందిస్తున్నారని రోగులు చెబుతున్నారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుఅవుతున్నా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న వైద్యసేవలపై సీఎం వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతి కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించానని తెలిపారు. అన్ని వార్డుల్లో తిరిగి, బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు.