ఎల్లుండి నుంచి  సీఎం వైయ‌స్‌ జగన్‌ బస్సుయాత్ర 

తాడేప‌ల్లి: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఎల్లుండి(27వ తేదీ) నుంచి మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైయ‌స్‌ జగన్‌ బస్సుయాత్ర చేప‌ట్ట‌నున్నారు.

ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్రను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభిస్తారు.

27వ తేదీ ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయ చేరుకుంటారు, అక్కడ వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద ప్రార్ధనల అనంతరం నివాళి అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరు బయలుదేరుతారు (వయా వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల). సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడినుంచి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డకు (వయా దువ్వూరు, చాగలమర్రి) కు చేరుకుని రాత్రికి బస చేస్తారు.

Back to Top