23న గుంటూరు, వైయ‌స్ఆర్ జిల్లాల్లో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

అఘాయిత్యానికి, హత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈనెల 23న (బుధ‌వారం) గుంటూరు, వైయస్ఆర్ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తెనాలికి చెందిన యువతిని బుధవారం ఉదయం వైయస్ జగన్ పరామర్శించనున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె కుటుంబాన్ని కలుసుకోనున్నారు.  ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అనంతరం ఆయన నేరుగా పులివెందులకు వెళ్తారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

Back to Top