విచక్షణాధికారాలు పనిచేస్తాయా??

సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సీఎం వైయస్ జగన్ వేసిన పిటీషన్ డిస్మిస్ అవ్వడాన్ని పరాజయంగానో, భారీ నష్టంగానో భావించాల్సిన పని లేదు.
అనివార్య కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేని ప్రజా ప్రతినిధుల విషయంలో సెక్షన్ 317 ద్వారా కోర్టు ఎగ్జంమ్షన్ సాాధారణంగా జరిగేదే. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజాసంబంధిత కార్యక్రమాల్లో, ముఖ్యమైన బాధ్యతల్లో తలమునకలుగా ఉంటారు. కనుక డిస్పెన్స్ విత్ పర్సనల్ అటెండెన్స్ సెక్షన్ 205 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CRPC) పిటీషన్ సీబీఐ కోర్టులో వేసారు.
నిజానికి దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం కింది కోర్టులకు, ట్రైల్ కోర్టులకు ఉండదు. పైగా కేసు ట్రైల్ స్టేజ్ లో ఉన్నప్పుడు సీబీఐ లోయర్ కోర్టుకు ఈ పిటీషన్ పై నిర్ణయం తీసుకునే పవర్ ఉండదు. అలాగే సీబీఐ కోర్టును కాకుండా నేరుగా హైకోర్టుకు పిటీషన్ పెట్టే వీలు కూడా లేదు. హైకోర్టుకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన డిస్క్రీషనరీ పవర్ తో ఈ పిటీషన్ ను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. హైకోర్టు తనకున్న విచక్షణాధికారంతోనే 482 సెక్షన్ కింద సీబీఐ కోర్టుకు, ఇతర కింది స్థాయి కోర్టులకు సైతం ఆదేశాలిస్తుంది.
తాజాగా 2016 లో  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయలో జరిగిన క్రిమినల్ డిఫమేషన్ కేసు మనం ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  
రాజకీయ కక్షల్లో భాగంగా మాజీ మంత్రి కపిల్ సిబాల్ కుమారుడు అమిత్ సిబాల్ కేజ్రీవాల్ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేసినప్పుడు...ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేజ్రీవాల్ తనకు ఈ కేసులో వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ ముక్తా గుప్తా ఆధ్వర్యంలోని ఢిల్లీ హైకోర్టు కేసు విచారణ పూర్తి అయ్యేవారకూ సీఎం కేజ్రీవాల్ కు  వ్యక్తిగత హాజరు నుంచి ఎగ్జమ్షన్ ఇచ్చింది. ఇది పర్మినెంట్ ఎగ్జమన్షన్. అయితే అవసరం అనుకున్నప్పుడు స్పెషల్ ఆర్డర్ ఇచ్చి వాయిదాకు పిలుచుకోవచ్చని, ప్రతి వాయిదాకూ హాజరవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ రెండు కేసుల్లోనూ ముఖ్యమైన అంశం ట్రైల్ కోర్టు. ట్రైల్ కోర్టులకున్న అధికార పరిధులతో పోలిస్తే హైకోర్టుకున్న పరిధి చాలా పెద్దది. వైయస్ జగన్ కేసు నడుస్తున్నది కూడా ట్రైల్ కోర్టులోనే. ఎగ్జమ్షన్ అనేది సీబీఐ పరిధిలో లేని అంశం కనుక ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించే అవకాశం కలిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి క్రిమినల్ డిఫమేషన్  కేసును పరిగణలోకి తీసుకున్నప్పుడు హైకోర్టు విచక్షణాధికారాల వల్ల వైయస్ జగన్ కేసులోనూ ఊరట లభిస్తుందని ఆశించవచ్చు.  

Read Also: అక్షరాస్యత పెంచేందుకు ‘అమ్మఒడి’

Back to Top