గుంటూరు) గుంటూరు జిల్లా పెదగొట్టిపాడు ప్రమాదం బాధితుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఎండగట్టారు. ఈ సందర్బంగా ఆయన చేసిన పవర్ ఫుల్ కామెంట్లు.<br/>1. మృతుల కుటుంబాలకు 30 లక్షలు ఎక్స్ గ్రేసియా, ఐదెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చినా, ఏ ఒక్కటీ అమలు చేయలేదు. 2. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి.3. 10 రోజుల్లో న్యాయం జరగకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తాం.4. 30 అడుగులు తవ్వితే మట్టిపెళ్లలు కూలుతాయన్న సంగతి ఎవరికైనా తెలుసు5. కూలీల మృతికి బిల్డరే కారణం, ఇంత వరకు బిల్డర్ను అరెస్ట్ చేయలేదు<br/>6. ఇన్సూరెన్స్ డబ్బు కూలీలకు ఎందుకు ఇవ్వడం లేదు?అంటే నిబంధనలు చూడకుండా బిల్డింగ్కు పర్మిషన్ ఇచ్చారా?7. బిల్డర్ దగ్గర నుంచి కనీసం 25 లక్షల రూపాయలు వసూలు చేయాలి8. 5 లక్షల రూపాయల చొప్పున కూలీ కుటుంబానికి ప్రభుత్వం నేరుగా ఇవ్వాలి9. డబ్బులిస్తే వెళ్లిపోతామన్న కూలీలతో పనిచేయించి చంపారు,10. మృతుల కుటుంబాలకు మద్దతుగా నేను ధర్నాలో కూర్చుంటా