కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రెండు పార్టీలలో కలకలం
01 Sep 2012 7:12 AM
ఒకే రోజు రెండు పార్టీలు... రెండు దెబ్బలతో విలవిలలాడిపోయాయి. సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి కాంగ్రెస్ పార్టీనీ, పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు తెలుగుదేశం పార్టీకీ గుడ్బై చెప్పేశారు.
ఇటీవలి కాలంలో దెబ్బ మీద దెబ్బ తింటున్న తెలుదేశం పార్టీ చెంగల నిర్ణయంతో కంగు తింది. అక్టోబరు 15వ తేదీన తాను వైయస్ఆర్ సీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మే ఉప ఎన్నికలలో పాయకరావుపేట నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీనికి సొంత పార్టీ నేతలే కారణమని చెంగల ధ్వజమెత్తారు. పదమూడేళ్ళపాటు ఎంతో నమ్మకంగా పనిచేసిన తనకు తెలుగుదేశం పార్టీలో అవమానమే బహుమతిగా లభించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో వైయస్ జగన్మోహనరెడ్డిపై చెంగల ప్రశంసల వర్షం కురిపించారు. ఇటాలియన్ మహిళను ఎదిరించిన ఒకే ఒక ధీరుడు ఆయనని కితాబిచ్చారు.
మరోవంక, సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి గత కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఆశించారు. ఇటీవలి కాలంలో ఆయన స్వరం మారింది. అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరతారని ఊహాగానాలు వినిపించాయి. శనివారం నాడు నల్గొండ జిల్లా భువనగిరిలో తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 9న వైయస్ఆర్ సీపీలో చేరతానని చెప్పారు. వైయస్ హయాంలోనే అందరూ లబ్ధిపొందారని తెలిపారు. కిరణకుమార్కు పాలనాదక్షత లేదని ఆయన ధ్వజమెత్తారు.
శనివారం చోటుచేసుకున్న ఈ పరిణామాలూ ఆ రెండు పార్టీలకు గుక్కతిప్పుకోలేని పరిస్థితిని కల్పించాయి. తెలుగు దేశం పార్టీకి వల్లభనేని వంశీ ఒకానొక దశలో చెమటలు పట్టించారు. ఓదార్పు యాత్రలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని రోడ్డుపైనే కలిసి కరచాలనం, ఆలింగనం చేసుకున్న వంశీ ఉందతంతో చంద్రబాబు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. దేవినేని ఉమామహేశ్వరరావుతో ఉన్న అభిప్రాయ భేదాలే ఈ ఉదంతానికి కారణమని పలువురు చెప్పడంతో సరిదిద్దేందుకు ప్రయత్నించారు. తాను పార్టీని వీడతానని చెప్పలేదే... అంటూ వంశీ చేసిన ప్రకటనతో ఆ ఘట్టం ముగిసింది. తదుపరి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) వైయస్ఆర్ సీపీలో చేరి కలకలం సృష్టించారు. అది చల్లారకముందే ఇప్పుడు చెంగల వెంకటరావు కొత్త తుపాను సృష్టించారు.