ఆరోగ్యశ్రీ

రాజీవ్ ఆరోగ్య శ్రీ  పథకం పేద ప్రజల సంజీవినిగా పేరు గాంచింది.  దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజలకు ఆరోగ్య బీమా పథకం, ఈ  పథకం కింద  అవసరమైన వారికి  శస్త్రచికిత్సతో సహా మొత్తం ఖర్చు ₹ 2 లక్షల వరకు చెల్లించటానికి ఏర్పాటు చేయబడింది.

వైఎస్ మానస పుత్రిక అనిపించుకున్న ఆరోగ్యశ్రీ పేదలకూ పెద్ద వైద్యం అందించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం ఓ సంచలనాత్మక నిర్ణయం. 2007లో మహానేత ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ తొలుత 3 జిల్లాల్లో 163 వ్యాధులకు చికిత్స అందించేలా రూపొందించారు. రెండేళ్ల కాలంలోనే ఈ సేవలను విస్తరించి ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. కేన్సర్, గుండె జబ్బులు,న్యూరో, గర్భ కోశవ్యాధులు, ప్రమాదాల బారిన పడిన వారు ఇలా లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. చిన్నారుల్లో వినికిడి లోపాలను సవరించేందుకు కాంక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ కోసం ఒక్కొక్కరికీ 6.5 లక్షలు వెచ్చించిన ఘనత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకానిదే. ఏటా బడ్జెట్ లో ఆరోగ్య శ్రీ పథకం కోసం 925 కోట్ల రూపాయిలు కేటాయించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో 375 కోట్లు కూడా అందించి మొత్తం 1,400 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. పేదల ఆరోగ్యం పట్ల ఇంతటి శ్రద్ధ చూపిన పాలకుడు ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే లేడు. ఆరోగ్యశ్రీ  పథకానికి పెద్ద ఎత్తున లభించిన స్పందన చూసిన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టాయి. పేదరికంవల్ల చికిత్స అందక ఏ ఒక్కరూ మరణించకూడదన్న మహానాయకుడి సంకల్పమే ఆరోగ్యశ్రీగా ఎందరో అభాగ్యులకు ఆయువు పోసింది. డాక్టర్ గా ఎందరికో ప్రాణదానం చేసిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరెందరో పేదల ప్రాణాలకు కొండంత అండై నిలిచాడు.

Back to Top