నేటి సాయంత్రం వైయస్ఆర్ సీపీ కీలక సమావేశం

నెల్లూరు: రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయడానికి, వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులతో  సోమవారం సాయంత్రం కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్  జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొంటున్నారు.  నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్ద కొండూరులో ప్రజా సంకల్ప పాదయాత్ర శిబిరం వద్ద ఈ సమావేశం జరగనుంది.





Back to Top