ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్‌ అభినందనలు

హైదరాబాద్, 5 నవంబర్ 2013:

అంగారక గ్రహ యాత్రలో భాగంగా మార్సు ఆర్బిటర్ మిష‌న్‌ (మంగళయాన్) ప్రయోగాన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ అపూర్వ విజయం సాధించి మన దేశాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అగ్రదేశాల సరసన నిలిపారని ఆయన కొనియాడారు. ప్రపంచంలో అంగారక యాత్ర చేపట్టిన నాలుగవ దేశంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన ఇస్రో భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

Back to Top