స్పీకర్ : జూపూడి ప్రభాకరరావు - మే 11,2012

నిన్న తెలుగుదేశం పార్టీనాయకులు అసెంభ్లీలో రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు రామోజిరావు గురించి మాట్లాడిన మాటలు నేనుదాని మీద మాట్లాడితే మీరు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అసెంబ్లీ రికార్డ్‌లను తారుమారు చేసేవిదంగా మాట్లాడుతున్నారు. రాజశేఖరరెడ్డి గారు అసెంబ్లీలో ఉండి చేసిన ప్రకటణ రామోజిరావు గారికి రెండు పార్శలున్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జిలే చాల స్పష్టంగా రామోజిరావు గారి లాయర్‌ కి అక్షింతలు వేయలేదా ..రాజశేఖరరెడ్డి ఒక ప్రభుత్వ అధినేతగా రామోజిరావు గారి మీద ఎంక్వరివేశాడు. రాజశేఖరరెడ్డి గారు పత్రికకు రావలసిన అడ్యడైజ్‌మెంట్స్‌ అపలేదు. ఆ రోజు చేసిన ఎంక్వరి స్యయంగ ప్రభుత్వం చేసిన ఎంక్వరి. ఈ కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలా నల్ల జీఓ ఇవ్వలేదు. జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏ రోజు కూడ సాక్షి పత్రికస్వేచ్చ మీద జరిగిన అన్యాయం అని గాని ఈ రోజు వరకు అనలేదు. ఈ రోజు పత్రిక స్వేచ్చకు అన్యాయం జరిగింది అంటే జర్నలిస్టులు అందరూ జగన్‌మోహన్‌రెడ్డి గారికి అనుకులంగ మాట్లాడుతున్నారని దావుద్‌ ఇబ్రహిం పత్రిక పెడితే దానికి కూడ అనుకులంగా మాట్లాడుతారా అని చంద్రబాబునాయుడు గారు మాట్లడుతున్నారు. ఎమి మాట్లడాలో తెలియక పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారు చంద్రబాబునాయుడు గారు. జగన్‌మెహన్‌రెడ్డి గారు గత 8 నెలలుగా సీబీఐ ఎంక్వరినీ ఎదుర్కోంటున్నాడు.ఏనాడు కూడ సీబీఐఎంక్వరి తన పత్రిక మీద జరుగుతున్నా పత్రికాస్వేచ్చకు భంగం కలిగింది అని ఏనాడు అనలేదు. సీబీఐ అకౌంట్లని ప్రీజ్‌ చేసిన తర్వాత మరుసటి రోజు దొంగ దారిలో వచ్చి ఓ నల్లా జీఓ ఇచ్చి ఈ పత్రికలకు అడ్యడైజ్‌మెంట్స్‌ ఇవ్వకూడదు అని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు  ఇద్దరు కుమ్మకై ఇంతకాలం మీరుచేస్తున్న విధానంకి ఇది నిదర్శనం. పత్రికస్వేచ్చకు భంగం కలిగింది అని జర్నలిస్టులు మాట్లాడితే వాళ్ళని దావుద్‌ ఇబ్రహింకి గుండాల్లా తోత్తుల్లా మాట్లాడడం తెలుగుదేశం వారికే చెల్లింది. ఇందిరాగాంధీ కూడ ఎమర్జెన్సి సమయంలో పత్రికల మీద అడ్యడైజ్‌మెంట్స్‌ ఇవ్వద్దు అని చెప్పలేదు, ఇందిరాగాంధీ కూడ చేయనటువంటి దుస్సాహసానికి మీరు పాల్పడ్డారు. ఈ నల్లా జీఓలు అర్దరాత్రి విడుదల చేసి జగన్‌మోహన్‌రెడ్డి గారి గోంతునులమాలని మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఎదుర్కోండి.లేదా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయండి. నిరంకుశతత్వంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఈ రోజు సాక్షి మీద జరిగిన దాడి రేపు మీ మీద జరగదని బావిస్తున్నారా.. వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీని జగన్‌మోహన్‌రెడ్డిని అప్రదిస్టపాలు చేయడానికి చంద్రబాబు లేస్తే జగన్‌మోహన్‌రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో సమస్యల మీద పోరాడకుండా  రోజు ప్రెస్‌మీట్లు పెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టుకుంటు కాలం వెళ్ళదీస్తున్నాడు చంద్రబాబుగారు.ఈ రోజు సాక్షి పై జరిగినదాడి  లా ఈనాడు పై రాజశేఖరరెడ్డి గారు వేసిన ఎంక్వరి ఇంకా ఉంది దానిని ఆదారం చేసుకుని ఈనాడు పై దాడి చేయగలరా ఈ ప్రభుత్వనికి చిత్తశుద్ది ఉందా దమ్ము,దైర్యం ఉందా..ఈనాడు పత్రికకు ఒక రూలు మిగత పత్రికలకు ఒక రూలా..

Back to Top