వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సమైక్య ఉద్యమానికి సీఎం కిరణే విలన్
17 Nov 2013 8:30 AM
హైదరాబాద్ :
సమైక్యాంధ్ర ఉద్యమానికి సీఎం కిరణ్కుమార్రెడ్డి మొదటి విలన్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యం ముసుగులో రాష్ట్ర విభజనకు అన్ని రకాలుగా కేంద్రానికి ఆయన సహకరిస్తున్నారని, తెలుగు ప్రజల హృదయాల్లో జీవితకాలం విలన్గా నిలిచిపోతారని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. సమైక్య పేరుతో తెలుగు ప్రజలను మోసగించడం సమంజసం కాదని ఆయన అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి శ్రీకాంత్రెడ్డి మూడు ప్రశ్నలు సంధించారు. ‘సమైక్యానికి అనుకూలంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలు దాన్నే ప్రకటిస్తామంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగీకరించకపోగా, నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా?, జూలై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న రోజే సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే విభజన ప్రక్రియ నిలిచిపోయేది కాదా? రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి విభజనకు వ్యతిరేకంగా, సమైక్య తీర్మానం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్రెడ్డి ఎన్నిసార్లు కోరినా.. ఏమాత్రం పట్టనట్టు నోరు మెదపకుండా ఉన్నది నిజం కాదా?’ అని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. సమైక్యం పట్ల కిరణ్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.
కిరణ్కుమార్రెడ్డి చేతకానితనాన్ని మూడున్నరేళ్లుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రాష్ట్ర విభజన విషయంలో మరోసారి అది తేటతెల్లమైందని శ్రీకాంత్రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించి, సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వివరించి ఒప్పించగలిగారని ఆయన గుర్తుచేశారు. రచ్చబండ కార్యక్రమాల్లో ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్న కిరణ్ అవే మాటలను సీడబ్ల్యూసీ ముందు, సోనియా నివాసం టెన్ జన్పథ్ వద్ద అందరికీ వినబడేలా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా వారిద్దరూ సమైక్య ద్రోహులే :
చిత్తూరు జిల్లాకు చెందిన సీఎం కిరణ్కుమార్రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరూ సమైక్య ద్రోహులే అని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరూ సోనియా ఇచ్చిన స్క్రిప్టుతో తోలుబొమ్మలుగా నటిస్తున్నారని ధ్వజమెత్తారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను సోనియా ఆదేశాల మేరకే చంద్రబాబు ఉపసంహరించుకోవడంలేదన్నారు. మరోపక్క కిరణ్ తన కింద పనిచేస్తున్న అధికారులను ఢిల్లీకి పంపి విభజనకు అటంకం కలగకుండా కేంద్రానికి సహకరించడమే గాక, విభజన కోసం ప్రత్యేక నివేదికలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
మూడున్నర నెలలుగా ఉద్యోగులు ‘జీతాలు కాదు జీవితాలు ముఖ్యం’ అనే విధంగా ఉద్యమిస్తే, ఒక పథకం ప్రకారం తానుండగా విభజన జరగదంటూ కిరణ్కుమార్రెడ్డి ఉద్యమానికి వెన్నుపోటు పొడుస్తున్నారని శ్రీకాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజనను అడ్డుకునేందుకు కిరణ్ చేసిన ప్రయత్నాలేంటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల్లో ఎనలేని ఆదరాభిమానాలున్న వైయస్ఆర్ కాంగ్రెస్పై బురద చల్లడమే పనిగా ఆ రెండు పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. అఖిలపక్ష సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేయకుండా అన్ని ప్రాంతాల వారూ సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరితే దాన్ని తప్పుపడుతున్నారని శ్రీకాంత్రెడ్డి అన్నారు.