వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబు పాలన చీకటీ అధ్యాయం
03 Sep 2018 6:14 PM
విశాఖ జిల్లాః ‘రాజన్నబిడ్డ’ పాలన కోసం ఎదురు చూస్తుందని వైయస్ఆర్సీపీ నేత వరుదు కల్యాణి అన్నారు. విశాఖ జిల్లా కె.కోటపాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దివంతగ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో నిలిచిపోయిన అభివృద్ధి మళ్లీ జననేత జగన్తో పురోగమిస్తుందన్నారు. మాటతప్పని మడమ తిప్పని జగనన్న భరోసాతో వైయస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. దివంగత మహానేత 60 నెలల పాలనలో 60 సంవత్సరాలకు సరిపడే కిర్తీని సంపాదించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, చంద్రబాబు ఆరువందల అబద్ధపు హామీలు ఇచ్చి మన రాష్ట్ర్రాన్ని మరో 60 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని విమర్శించారు.చంద్రబాబు పాలన ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించారు, వైయస్ఆర్ హయాంలో ప్రజలు స్కీంలు గురించి మాట్లాడుకునేవారని, నేడు చంద్రబాబు పాలనలో స్కాంలు గురించి మాట్లాడుకుంటున్నారన్నారు.