<br/>విశాఖపట్నం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. భరోసా నింపేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత చేపట్టిన పాదయాత్ర 241వ రోజు సోమవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ శివారు గ్రామమైన ధర్మసాగరం క్రాస్రోడ్డు నుంచి ప్రారంభం కాగా కొద్ది సేపటి క్రితమే యండవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతకు ఘన స్వాగతం పలికారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాజన్న బిడ్డ ముందుకు సాగుతున్నారు.