కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం బనగానపల్లె మండలంలోని ఎనకండ్ల గ్రామానికి చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 13వ రోజు వైయస్ జగన్ బనగానపల్లె నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతకు ఘన స్వాగతం పలికారు.