ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా గడిపత్రివారి పాలెం చేరుకున్న వైయస్ జగన్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమకు పింఛన్లు అందడం లేదని, రేషన్ కార్డులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు అన్యాయం చేస్తున్నాయని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా కల్పించారు.