59వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 59వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం 8.30 గంటలకు గుండుపల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 9.15 గంటలకు చవటగుంట, 9.30 గంటలకు వెదురుకుప్పం, 10 గంటలకు మండివెంగన్నపల్లి, 10.30 బలిజమెండిపల్లి, 11 గంటలకు కమ్మ కండ్రిగ, 11.30 గంటలకు బ్రహ్మంపల్లి చేరుకుంటారు. 12.15 గంటలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. 2.30 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. 4 గంటలకు చంద్రగిరి నియోజకవర్గంలోని అనుప్పల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 4.45 గంటలకు నెమలిగుంటపల్లి గ్రామంలో బహిరంగ సభ ఉంటుంది. సాయంత్రం 5.45 నిత్తిగుంటపల్లి వరకు పాదయాత్ర సాగుతుంది. 
Back to Top