271వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 271వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం వైయస్‌ జగన్‌ ఎస్‌.కోట నియోజకవర్గంలోని లక్కవరం కోట మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సంతపేట, లక్కవరం కోట, ఖాశపేట వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కుమ్మవరం క్రాస్, తలారీ, కొట్యాడ వరకు 271వ రోజు పాదయాత్ర కొనసాగుతుంది.
 
Back to Top