కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముద్దవరం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ గ్రామంలో ప్రవేశించగానే వైయస్ జగన్ పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తి చేయడంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్రెడ్డిని పలువురు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.