249వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


ప్రకాశం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 249వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం ఉదయం యలమంచలి నియోజకవర్గంలోని మునగపాక మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మునగపాక, గంగదేవిపేట క్రాస్, ఓంపోలు, నాగులపల్లి వరకు కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం నాగులపల్లి మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోని అడుగుపెడతారు. అనకాపల్లి టౌన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం తుమ్మపాల వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం వివరించారు.
 

తాజా వీడియోలు

Back to Top