<br/>విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం వైయస్ జగన్ పాదయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.