విర‌వ నుంచి 225వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

 తూర్పుగోదావరి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. జననేత వైయ‌స్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ రాజన్నతనయుడు ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం మీదుగా పిఠాపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. పిఠాపురంలో సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు. 

 
Back to Top