కోట్యాడ నుంచి 272వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం




 విజయనగరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 272వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని లక్కవరపుకోట మండలం కోట్యాడ నుంచి ప్రారంభించారు.  అక్కడి నుంచి జమి మండలంలోని ఆగ్రహారం మీదుగా కిర్లా వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.

అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్‌క్యాంప్‌ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు.
Back to Top