కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
12న ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం
10 Nov 2018 12:15 PM
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను నవంబర్ 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించడంతో ఆయన పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న వైయస్ జగన్ ముందుగా ప్రకటించిన విధంగా ఇచ్ఛాపురం వరకు తన పాదయాత్రను కొనసాగిస్తారని రఘురాం వెల్లడించారు. ఈ నెల 12 న విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ నుంచి పాదయాత్ర పున: ప్రారంభం కానుందని పేర్కొన్నారు.