తూర్పు గోదావరి: కాపు కార్పొరేషన్కు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయిస్తామన్న వైయస్ జగన్ హామీ పట్ల కాపు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన కాపు నేతలు వైయస్ జగన్ను తుని పట్టణంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయస్ జగన్ వెంటే కాపులుంటారని కాపు రిజర్వేషన్ పోరాట సమితి సెక్రటరీ కోలా ప్రభాకర్ పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు వైయస్ జగన్ అని చెప్పారు.