వైయస్‌ జగన్‌ను కలిసిన కాపు నాయకులు

తూర్పు గోదావరి: కరకుదురు గ్రామంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కాపు నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను వినతిపత్రం ద్వారా తెలియజేశారు. మాకు రిజర్వేషన్లు కల్పించాలని, కాపు కార్పొరేషన్‌కు నిధులు రెట్టింపు చేయాలని కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌..సానుకూలంగా స్పందించారు. అన్ని కులాలనకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో కాపులు హర్షం వ్యక్తం చేశారు. కాపు జాతి అంతా కూడా వైయస్‌ జగన్‌ వెంట ఉంటామని, ఆయన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని నినదించారు. 
 
Back to Top