<strong>విజయనగరం:</strong> నాలుగేళ్లుగా వరి,మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధరలేదని కొట్యాడ గ్రామ రైత్తులు ఆవేదన వ్యక్తం చేశారు.విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు విన్నవించారు. కూలీ,ఎరువుల ధరల పెంచి మద్దతు ధర‡ పెంచలేదని వాపోయారు. చెక్డ్యాంల పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు. రైతుల పట్ల జననేత సానుకూలంగా స్పందిస్తూ పంటలకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం అందిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. <br/>