బాబు పాలనకు కాలం చెల్లింది

గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వైయస్సార్సీపీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. బాబును నమ్మి మోసపోయామని తమ వద్దకు వచ్చిన వైయస్సార్సీపీ నాయకులకు కష్టాలు చెప్పుకొని ప్రజలు విలపిస్తున్నారు. మరో రెండేళ్లు ఓపిక పట్టాలని, వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని కష్టాలను పారదోలుదామని నేతలు ప్రజలకు భరోసానిస్తున్నారు. 

టెక్కలి నియోజకవర్గo, సంతబొమ్మాలి మండలం , భావనపాడు గ్రామం టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ గారి ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాబు మోసపూరిత పాలనపై ప్రజాబ్యాలెట్ అందించి మార్కులు వేయించారు. బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Back to Top