విస్తృతంగా నవరత్నాలు ప్రచారం

బుక్కపట్నం: నియొజకవర్గంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్లి నవరత్నాల ప్రాధాన్యతను వివరించే కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను వైయస్సార్‌ కుటుంబం ద్వారా ప్రజలకు వివరించారు. ఈ పథకాలు అమలు కావాలంటే జగనన్నను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.. ప్రతి కుటుంబ సభ్యులతో 91210 91210 నంబరుకు కాల్‌ చేయించి వైయస్సార్‌ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. బుక్కపట్నంలో బోసే గంగాధర్, మాల్యవంతం మారుతి,మాజీ స్టోర్‌ డీలర్‌ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top