తూర్పుగోదావరిః ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలను మోసగించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ విమర్శించారు. ముమ్మిడివరం మండల పరిధిలోని గున్నేపల్లి గ్రాయంలో పితాని నాల్గవరోజు గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ...వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుంటే రాజన్న పాలన తిరిగివస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. <br/><br/>