వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎన్డీఏకు చిత్తశుద్ధి ఉంటే హోదాపై చర్చించాలి
22 Mar 2018 9:59 AM
ఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైయస్ఆర్సీపీ పార్లమెంట్లో ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చించాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ప్రత్యేక హోదాపై సభలో చర్చ జరిగే వరకు పట్టుబడతామని, మరోసారి ఈ విషయంపై స్పీకర్ను కలుస్తామని ఆయన తెలిపారు. గురువారం ఉదయం వైయస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఎవరు హోదా కోసం పోరాటం చేస్తున్నది ప్రజలకు తెలుసు అన్నారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.