వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పోలీసుల అత్యుత్సాహం
23 Jul 2018 9:22 AM
- కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్
- కదిరిలో సిద్దారెడ్డి ఏర్పాటు చేసిన వేదిక ధ్వంసం
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న వైయస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా వైయస్ఆర్ సీపీ నేత, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం అల్లూరు మండలం ఇసుకపల్లెలో ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మత్స్యకార గ్రామాలకు వెళ్లకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం ముందు భారీగా భద్రతా దళాలు, పోలీసులు మోహరించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిని పర్యటించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే
వైయస్ఆర్సీపీ నేత డాక్టర్ సిద్ధారెడ్డి కదిరి పట్టణంలో ఏర్పాటు చేసిన వేదికను పోలీసులు బలవంతంగా తొలగించారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్సీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.