వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ నేతలపై ప్రతిపక్షసభ్యుల ఫైర్..!
04 Sep 2015 1:11 PM
బ్రీఫుడ్ విత్ సీఎం బ్రీఫ్ కేసులు ఎక్కడినుంచి తెచ్చారో చెప్పండి...!
అధికారపార్టీ ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. తాము వాయిదాతీర్మానం ఇస్తే టీడీపీ నేతలు షాక్ కొట్టిన కాకుల్లా గగ్గోలు పెడుతున్నారని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా ధ్వజమెత్తారు. నోటీసు ఇస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని రోజా పాలకపక్షాన్ని ప్రశ్నించారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇది తెలంగాణ సంబంధించిన అంశమంటున్నారని, మరి అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం మత్తయ్యకు ఎందుకు రక్షణ కల్పించిందో చెప్పాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ లో దోచుకున్న డబ్బులతో ఎమ్మెల్సీలను కొనడానికి ప్రయత్నించారని రోజా విమర్శించారు. బ్రీఫుడ్ విత్ సీఎం బ్రీఫ్ కేసులు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు 15 సార్లు డీజీపీతో భేటీ అయిన చంద్రబాబు..రిషితేశ్వరి,వనజాక్షి కేసులో ఎన్నిసార్లు పోలీసులతో సమావేశమయ్యారో చెప్పాలన్నారు.