బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
వైయస్ఆర్సీపీలో చేరడం ఆనందంగా ఉంది
24 Aug 2018 12:26 PM
విశాఖ: ప్రజల కోసం శ్రమిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన విడదల రజనీ పేర్కొన్నారు. గురువారం ఆమె వైయస్ జగన్ సమక్షంలో వేలాది మంది కార్యకర్తలతో కలిసి వైయస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావడంతో వాటి సాధనకు నాలుగేళ్లుగా వైయస్ జగన్ పోరాడుతున్న తీరు తనలో స్ఫూర్తిని పెంచిందన్నారు. గతేడాది నవంబర్ నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ప్రజల మధ్యే ఉన్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ ఒక్కరినే చూశానని, తప్పకుండా ఆయన సీఎం అవుతారని, ప్రజల కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత ఏ నాయకుడికి దొరకని ప్రజల ప్రేమ, ఆదరణ వైయస్ జగన్కు లభిస్తున్నాయన్నారు. వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానని రజనీ పేర్కొన్నారు.