మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
నాలుగేళ్ల తరువాత పేరూరు గుర్తుకొచ్చిందా బాబూ?
01 Aug 2018 9:20 AM
అనంతపురం: నాలుగేళ్ల పాటు నోరు మెదపకుండా ఉండి ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు చంద్రబాబు పేరూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారని వైయస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మండిపడ్డారు. పేరూరు డ్యాంకు పైసా ఖర్చు లేకుండా హంద్రీనీవా నుంచి నీటిని ఇవ్వవచ్చు అని, అయితే మంత్రి పరిటాల సునీతకు లబ్ధి చేకూర్చేందుకు రూ.800 కోట్లతో కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారని తప్పుపట్టారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడమే టీడీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని, రైతులను విస్మరించిన టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.