మరో రెండ్రోజుల్లో ఎలమంచిలిలోకి పాదయాత్ర

విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు కన్నబాబురాజు పిలుపు
సుమారు వారం రోజుల పాటు ఎలమంచిలిలో ప్రజాసంకల్పయాత్ర
విశాఖ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర మరో రెండ్రోజుల్లో ఎలమంచలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుందని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కన్నబాబురాజు చెప్పారు. నాయకులు, కార్యకర్తలు పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు మునగపాడులో ఎలమంచిలి నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో రెండ్రోజుల్లో పాదయాత్ర ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో వైయస్‌ జగన్‌ అడుగుపెట్టనున్నారన్నారు. సుమారు వారం రోజుల పాటు ఎలమంచిలిలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జననేత దృష్టికి తీసుకురావాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. 
 
Back to Top