వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి


గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పార్టీ వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైయస్‌ జగన్‌ చేపట్టి ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా బ్రహ్మనాయుడు నియోజకవర్గంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్ర 16వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. రాజన్న పాలన అందించేందుకు వైయస్‌ జగన్‌ ప్రజల మధ్యకు వచ్చారన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క వాగ్ధానాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. మళ్లీ చంద్రబాబు మాటలకు మోసపోకుండా వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
Back to Top