బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
హోదా కోసం వైయస్సార్సీపీ పోరుబాట
10 May 2016 1:36 PM
ఏపీః కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ప్రత్యేకహోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోంది. ప్రత్యేకహోదా సాధనే లక్ష్యంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్సీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ ల వద్ద ధర్నా చేపట్టారు. హోదాపై మాట తప్పిన టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనంతపురం : ప్రత్యేక హోదా కోరుతూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ, గుర్నాథ్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, తిప్పస్వామి, రాంరెడ్డి, మోహన్రెడ్డిలతోపాటు వందలాది మంది కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కేంద్రం వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. హోదాపై తెలుగు ప్రజలను అధికార టీడీపీ వంచిస్తోందని మండిపడ్డారు.
వైయస్సార్ జిల్లా : ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్టీ నేతలు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఎమ్మెల్యేలు రఘరామిరెడ్డి, రవీంద్రనాథ్రెడ్డి, అంజాద్ బాష, కొరుముట్ల శ్రీనివాసులు, రాచమళ్ల ప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మేయర్ సురేష్ బాబుతో పాటు వందలాది మంది కార్యకర్తలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదులు చేశారు.
విశాఖ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా ... విశాఖ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ ధర్నా చేపట్టింది. వైయస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ సహా పలువురు నేతలు ఈఆందోళనలో పాల్గొన్నారు. తక్షణమే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
చిత్తూరుః పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, డా.సునీల్ కుమార్, పార్టీ ఇంఛార్జ్లు జంగాలపల్లి నివాసులు, సురేష్, ద్వారకానాథ్ లు జిల్లా కలెక్టరేట్ వద్ద హోదా కోసం ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నయవంచనపై నిప్పులు చెరిగారు.
కర్నూలుః ప్రత్యేక హోదా కోరుతూ కలెక్టరేట్ల వద్ద వైఎయస్ఆర్సీపీ ధర్నాలకు పిలుపు ఇచ్చిన సందర్భంగా.... కర్నూలు కలెక్టరేట్ వద్ద నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరిత, సాయి ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్రెడ్డి, మురళి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డిలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. హోదా విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
గుంటూరుః రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు, నేతలు అంబటి రాంబాబు, మర్రిరాజశేఖర్ , లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నెల్లూరు- రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఉదయం నెల్లూరు కలెక్టరేట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్రెడ్డి, నేతలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ప్రసన్నకుమార్రెడ్డి, అనిల్కుమార్, ప్రతాప్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, యల్లసిరి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంః ఎమ్మెల్యే కంబాల జోగులు, రెడ్డిశాంతి, తమ్మినేని, వరుదు కల్యాణి, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాస్, రామారావు, జుత్తు జగన్నాయకులు, సాయిరాజ్లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకం ఆడుతున్నాయని ఈ సందర్భంగా నేతలు దుయ్యబట్టారు. నరేంద్రమోడి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పశ్చిమగోదావరిః జిల్లా ఏలూరులో చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, పిళ్లంగోళ్ల లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
విజయనగరంః ప్రత్యేకహోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనాయుడు, అప్పల నర్సయ్య, నియోజకవర్గ ఇంఛార్జ్ లు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రకాశంః జిల్లాలోని కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ నేతలు ప్రత్యేకహోదా కోసం గర్జించారు. ఎమ్మెల్యేలు జంకె వెంకట్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ , వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి , కె.వి. రమణారెడ్డి , కుప్పం ప్రసాద్, అశోక్, భరత్ ఇతర నేతలు, నాయకులు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని నినదించారు.
To read this article in English: http://bit.ly/1QX4qOS