ఐదో రోజు వైఎస్ జగన్ యాత్ర షెడ్యూల్

ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ రైతు భ‌రోసా యాత్ర జన ఉప్పెనలా సాగుతోంది. ఐదో రోజు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ కదిరి ఆర్అండ్‌బీ అతిధి గృహం నుంచి అల్లిపూర్ తండా, ముత్యాల చెరువు, పులగం పల్లి, మిట్టపల్లి, ఇనగలూరు క్రాస్, గాజుకుంటపల్లి, ఓబులదేవర చెరువు మీదుగా వడ్డివారి పల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు హరినాథ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా అనంతపురం చేరుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్నాలో పాల్గొంటారు. 

Back to Top