మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
రేపే అవిశ్వాస తీర్మానం..
15 Mar 2018 11:59 AM
ఢిల్లీ: ప్రత్యేక హోదా సాధనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఈ మేరకు కేంద్రంపై ఈ నెల 16న అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు ఉండటంతో ఈ విషయంపై వైయస్ జగన్తో పార్టీ ఎంపీలు మాట్లాడారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుగా భావించామని, అయితే పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉండటంతో రేపే అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకాలని కోరుతూ అన్ని పార్టీలకు వైయస్ జగన్ లేఖలు రాశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని నేపథ్యంలో, తాము పెడుతున్న అవిశ్వాస తీర్మానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని వైయస్ జగన్ లేఖలో కోరారని చెప్పారు. సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన రోజు ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.