<strong>విజయనగరం:</strong> ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం జిల్లాకు బయలుదేరారు. రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. దుర్ఘటన జరిగిన స్ధలాన్ని ఆయన పరిశీలించనున్నారు. <br/>రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి..: రైలు ప్రమాదం గురించి తెలియగానే వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.