వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
చంద్రబాబూ..నీవు బాధ్యుడివి కాదా?
03 May 2018 5:36 PM
అమరావతి: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమవుతున్నాయని, నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని వైయస్ జగన్ పేర్కొన్నారు. ఈ ఘటనలకు చంద్రబాబే బాధ్యుడని ఆయన విమర్శించారు. దాచేపల్లి ఘటనపై వైయస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు వైయస్ జగన్ ట్విట్టర్లో దాచేపల్లి ఘటనను ఖండించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేశారు. గత కొన్ని నెలలుగా ఏపీలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనల్లో దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే..నిందితులను సరిగా శిక్షించకపోవడం వల్లే ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని, నిందితులపై సరైన చర్యలు తీసుకోకపోవడానికి చంద్రబాబూ..నీవు బాధ్యుడివి కాదా? అని వైయస్ జగన్ నిలదీశారు.