బాబు మోసపు హామీలపై రణ భేరి

హైదరాబాద్, డిసెంబరు 4: రైతుల, డ్వాక్రా అక్కా చెల్లెమ్మల రుణాల మాఫీ విషయంలో మాట తప్పి ప్లేటు ఫిరాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడుతున్న నేపధ్యంలో ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామంటూ ప్రచురించిన టీడీపీ మేనిఫెస్టోలు, ఇంటింటికీ పంపిణీ చేసిన కరపత్రాలను చూపించారు.

చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధికారం కట్టబెడితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. మరో ఐదేళ్లపాటు ఎన్నికలు ఉండవన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రజలను మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఇది చాలదన్నట్లు అడ్డగోలుగా పింఛన్లు కత్తిరించే కార్యక్రమం కూడా జరిగిందన్నారు. తాము ఆందోళనలకు దిగాం కాబట్టే చంద్రబాబు ఈరోజు కొంతమేరకైనా రుణమాఫీ ప్రకటించారని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో అందరూ కలసికట్టుగా పాల్గొనాలని జగన్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయనేం చెప్పారంటే...

రాష్ట్రంలో కోటికి పైగా రైతుల ఖాతాలుండగా చంద్రబాబు 22 లక్షల ఖాతాలకే రుణమాఫీ వర్తింప చేస్తామని చెప్పడం దారుణం. అదికూడా ఎంత మొత్తం మాఫీ చేస్తారో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టారు. మరోవైపు రైతుల, డ్వాక్రా మహిళల లక్ష కోట్ల రూపాయల రుణంపై 14 శాతం అపరాధ వడ్డీ అంటే రూ. 14 వేల కోట్లవుతుంది. కానీ చంద్రబాబు బడ్జెట్ లో కేటాయించింది కేవలం రూ. 5 వేల కోట్లే. ఈ మొత్తంతో 20 శాతం రుణమాఫీ చేస్తానని భావ్యమేనా? 

2012-13, 2013-14 ఖరీఫ్ కాలాలకు సంబంధించి పంటల భీమా కింద వచ్చిన రూ. 68 కోట్లు, రూ. 570 కోట్లు రైతులు చెల్లించాల్సిన అప్పుల కింద జమచేశారు. ఇప్పుడు రబీ ముగుస్తున్న రైతులకు పంటల భీమా లేదు. కొత్త రుణాలు ఇవ్వలేదు. పాత రుణాలు మాఫీ కాలేదు. ఇది చాలదన్నట్టు రైతులపై అపరాధ వడ్డీ భారం పడింది.

చంద్రబాబుకు అన్నీ తెలుసుద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ)లో ఏఏ జిల్లాల్లో ఏ మేరకు అప్పులున్నాయో స్పష్టంగా వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక జూన్ 30వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు సమర్పించిన నివేదికలోని 6వ పేజీలో 2014 మార్చి 31వ తేదీ నాటికి మొత్తం రైతుల రుణాలు రూ. 87,612 కోట్ల మేరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవికాక డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14,204 కోట్లు. రెండూ కలిపితే రూ. 1,01,816 కోట్లు ఉన్నాయి. 

చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు జరిగిన బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ)లో ఏఏ జిల్లాల్లో ఏ మేరకు అప్పులున్నాయో స్పష్టంగా వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక జూన్ 30వ తేదీన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు సమర్పించిన నివేదికలోని 6వ పేజీలో 2014 మార్చి 31వ తేదీ నాటికి మొత్తం రైతుల రుణాలు రూ. 87,612 కోట్ల మేరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవికాక డ్వాక్రా మహిళల రుణాలు రూ. 14,204 కోట్లు. రెండూ కలిపితే రూ. 1,01,816 కోట్లు ఉన్నాయి. 

ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసు. అప్పులెంత ఉన్నాయో, ఖాతాలెన్ని ఉన్నాయో స్పష్టంగా తెలుసు. అయినా ఇవాళా ప్లేటు మార్చారు. పంటరుణాలని మాత్రమే అన్నానని చెబుతున్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అనలేదని బుకాయిస్తున్నారు. ఒక్కో సంఘానికి పదివేల రూపాయలు మాత్రం ఇస్తానని చెప్పానన్నాడు. ఇంతకంటే దారుణం, అన్యాయం మరొకటి ఉంటుందా? డ్వాక్రా రుణాల గురించి మాట్లాడదామంటూ దాటవేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజున తొలి సంతకం రుణాల మాఫీపైనే చేస్తానని చెప్పి, కోటయ్య కమిటీపై చేశారు. అది కూడా ఖాతాల్లో కోతలు పెట్టడానికి. 
చంద్రబాబు ప్లేటు ఫిరాయిస్తున్నారు. 

బాబు ఎన్నికలకు ముందు రుణమాఫీపై ఏం చెప్పారో, ఇప్పుడు ఎలా ప్లేటు ఫిరాయిస్తున్నారో క్లుప్తంగా మీకు వివరిస్తాను. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంలో ప్రధాన పాత్ర పోషించిన చంద్రబాబు తన ఎంపీలతో విభజనకు  అనుకూలంగా ఓట్లేయించి తమవల్లే విభజన జరిగిందని చెప్పుకున్నారు. విభజన తర్వాత తెలంగాణకు, సీమాంధ్ర ప్రాంతానికి వేర్వేరుగా 2 మేనిఫెస్టోలను చంద్రబాబు విడుదల చేశారు. వ్యవసాయ,డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ఆ 2 మేనిఫెస్టోల్లో పొందుపర్చారు. 

ఎన్నికలయ్యాక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజున చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు జారీ చేసిన ప్రకటనలో మొదటిపాయింటే రైతు రుణాల మాఫీ జరుగుతుందని ప్రచురించారు. రెండో పాయింట్ డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని వివరించారు. ప్రజలతో పని ఉన్నప్పుడు చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలోనూ, కరపత్రాల్లోనూ ఈ అంశాలే విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. గ్రామాల్లో అయితే పెద్ద పెద్ద లైట్లు అమర్చిన హోర్డింగ్ లతో రుణమాఫీ ప్రచారం చేసుకున్నారు. ఇక టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబు రుణమాఫీ ప్రచారమే కనిపించింది. చంద్రబాబు అప్పుడేం చెప్పారో మీరే చూడండి అని వీడియోలు ప్రదర్శించారు.

రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత నాదే.. మీరంతా (రైతులు) కష్టాల్లో ఉన్నప్పుడు చూశా.. మిమ్మల్ని ఆ కష్టాల నుంచి గట్టెక్కిస్తా.. అధికారంలోకి వచ్చాక నా మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తా.. రైతులు తీసుకున్న అన్ని బ్యాంకుల రుణాలను మాఫీ చేస్తాం.. అంటూ చంద్రబాబు వివిధ సభల్లో చేసిన ప్రసంగాలే సాక్ష్యాలు. 

బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకున్న రైతులు ఇక్కడ ఎవరున్నారో చేతులెత్తండి.. మీ అందరి రుణాలను మాఫీ చేస్తానంటూ బాబు ఓ సభలో చెప్పడం నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలను మోసం చేస్తున్నారు. ఆయన సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచీ 86 మంది రైతులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అనంతలోనే 40 మందికి పైగా మృతి చెందినట్లు పత్రికల్లో వారి పేర్లతో సహా ప్రచురించారు. విభజన తర్వాత రెవెన్యూ లోటు ఉండబోతుందనే విషయం బాబుకు ఎన్నికలకు ముందు తెలియదా? లోటుందనే విషయం బాబుకు తెలుసు, జగన్ కు కూడా తెలుసు. అన్నీ తెలిశాకే ప్రజలను మోసం చేయడానికే హామీ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తిపై 420 కేసు పెట్టాలా లేక 840 కేసు పెట్టాలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 


Back to Top