హైదరాబాద్: వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై ఆయన చర్చించారు. అలాగే తిరుపతి ఉప ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సేకరణ అంశం, పంట రుణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సోమయాజులు, మిథున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.