జగ‌న్‌కు ఇంటి భోజనానికి సిబిఐ కోర్టు అనుమతి

హైదరాబాద్, 10 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఇంటి భోజనం తీసుకునేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటి భోజనం తీసుకోవాలన్న నిమ్సు వైద్యుల సూచన మేరకు ఆయన సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. దాంతో శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాలుగు వారాల పాటు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు న్యాయస్థానం మంగళవారం అనుమతి ఇచ్చింది.

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో శ్రీ జగన్ చంచ‌ల్‌గూడ జైలులోనే నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. కఠోర దీక్ష చేసిన ఆయన ఆరోగ్యం ప్రమాదకర స్థితికి క్షీణించడంతో నిమ్సు ఆసుపత్రి వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్సు (గ్లూకోజ్) ఎక్కించారు. అయితే శ్రీ జగన్ ఆరోగ్యం కోలుకునేందుకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Back to Top