రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నేడు ఇఫ్తార్ విందుకు వైయస్ జగన్
05 Jul 2016 3:51 PM
- నేటి నుంచి జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
- రేపు వాటర్ప్లాంట్ల ప్రారంభోత్సవాలు
- 7న రైతు భరోసాయాత్ర
- 8న వైయస్ఆర్ జయంతి వేడుకలకు హాజరు
వైయస్సార్ జిల్లా (పులివెందుల) : ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు వైయస్సార్ జిల్లాకు వెళ్తున్నారు. నేటి నుంచి వైయస్ జగన్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నట్లు కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పర్యటన వివరాలు..
నేటి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 4.30కు వైయస్ జగన్ కడప ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో ముచ్చటిస్తారు. 6గంటలకు కడపలోని అమీన్పీర్ దర్గా సమీపంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని.. అక్కడ ఏర్పాటుచేసిన ఇఫ్తార్విందులో పాల్గొంటారని అవినాష్ రెడ్డి తెలిపారు. అక్కడ నుంచి నేరుగా పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటారు.
ఆరవ తేదీ షెడ్యూల్..
6వ తేదీన ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సింహాద్రిపురం మండలం చెర్లోపల్లె గ్రామానికి చేరుకుని ఎంపీ నిధులతో ఏర్పాటుచేసిన నూతన ఆర్వో ప్లాంటును ప్రారంభిస్తారు. అక్కడ నుంచి తొండూరు మండలం మల్లేలకు చేరుకుని పార్టీ నాయకుడు రవీంద్రనాథరెడ్డి సొంత నిధులతో ఏర్పాటుచేసిన నూతన మినరల్ వాటర్ప్లాంటును ప్రారంభిస్తారు. అనంతరం మల్లేల దర్గాను సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
ఏడవ తేదీ షెడ్యూల్..
7వ తేదీన ఉదయం 11గంటలకు లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చేరుకుని అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు మంజుల చలపతి కుటుంబసభ్యులను వైయస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం భోజనం అనంతరం చక్రాయపేట మండలం ముద్దప్పగారిపల్లెకు చేరుకుని ఇటీవల అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఎస్.చెన్నారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
ఎనిమిదవ తేదీ షెడ్యూల్..
8వ తేదీన ఉదయం తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కుటుంబసభ్యులతో ఇడుపులపాయలోని వైయస్ఆర్ ఘాట్కు చేరుకుని నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 10 గంటలకు వేంపల్లె మండలం ఇడుపులపాయ గ్రామానికి చేరుకొని గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారని ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి తెలియజేశారు.