బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఇదేనా మహిళా సాధికారికత
11 Feb 2017 12:22 PM
విజయవాడ: మహిళా సదస్సులో పాల్గొనకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డుకోవడం ఇదేనా మహిళా సాధికారికత అని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..మహిళా సదస్సుకు మమ్మల్ని ఆహ్వానించి రోజాను ఎయిర్పోర్టులోనే నిర్భందించారంటే మహిళలంటే ఎంతటి చిన్నచూపో అర్థమవుతుందన్నారు. రోజాకు జరిగిన అన్యాయం, మహిళా ప్రతినిధులకు జరుగుతున్న అక్రమాలపై ఈ సదస్సులో మేం నోరువిప్పుతామని భయపడిన చంద్రబాబు మమ్మల్ని గొంతు నొక్కుతున్నారు. రోజా అరెస్టుపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని ఆమె హెచ్చరించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సునే కించపరిచేలా చంద్రబాబు వ్యవహరించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని గిడ్డి ఈశ్వరి హెచ్చరించారు.