బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
బాలకృష్ణ మీద మహిళల ఆగ్రహం
10 Mar 2016 8:03 AM
అనంతపురం: సినీ హీరో, తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రవర్తన మీద మహిళా లోకంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సినిమా ఆడియో ఫంక్షన్ లో మహిళలను చాలా కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. దీని మీద స్తానిక, జాతీయ టీవీ చానెళ్లలో చర్చలు నడిచాయి. మహిళా మండల్లు, ప్రజా సంఘాల నాయకులు ఈ వ్యాఖ్యల్ని ఖండించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ నియోజక వర్గం హిందూపురంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే పదవికి బాలకృష్ణ అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్సార్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి మాట్లాడుతూ.. అమ్మాయిలకు ముద్దయినా పెట్టుకోవాలి, కడుపైనా చేయాలి, కమిట్ అయిపోవాలి.. అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. మహిళల గురించి నిజజీవితంలో ఇంత హీనంగా మాట్లాడే ఆయన సినిమాల్లో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు చెబుతుంటారంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా మండల కన్వీనర్ షామింతాజ్, రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్గౌడ్, కౌన్సిలర్లు రజనీ, షాజియా, జయమ్మ, శివ, ఆసీఫ్వుల్లా, నాగభూషణరెడ్డి, అంజినప్ప, నాయకులు సమద్, రియాజ్, నంజిరెడ్డి, రమేష్, చంద్రశేఖర్, రఘు, నరసింహారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు చంద్రశేఖర్రెడ్డి, గిరి, రఘు,న్యాయవాది గంగధర్ తదితరులు పాల్గొన్నారు.