నిప్పు నిప్పు అంటావే..విచారణ అంటే ఎందుకంత భయం

శ్రీకాకుళం: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నీతిగా వ్యవహరించి ఉంటే విచారణను ఎదుర్కోవాలని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఆముదాల వలసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ప్రతి రోజూ తాను నిప్పు నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. విచారణను ఎదుర్కొని చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు

Back to Top