మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
'విజయమ్మ, షర్మిల మహిళలకు స్పూర్తి'
05 May 2013 2:25 PM
బాపట్ల (గుంటూరు జిల్లా), 5 మే 2013: మహిళా లోకానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల మహిళల అందరికీ స్పూర్తి అని పార్టీ నాయకురాలు రోజా అన్నారు. మహిళల ఆత్మగౌరవ పరిరక్షణే ధ్యేయంగా, వారి ఆర్థిక భద్రతే లక్ష్యంగా గుంటూరు జిల్లా బాపట్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'మహిళా నగారా' పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో రోజా ప్రసంగించారు.
భర్త మరణించినా, కొడుకుని అన్యాయంగా జైలులో పెట్టినా ప్రజలకు శ్రీమతి విజయమ్మ అండగా నిలిచారని కొనియాడారు. శ్రీమతి విజయమ్మకు పాదాభివందనం చేయాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం, వారికి భరోసా ఇవ్వడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న శ్రీమతి షర్మిలకు చేతులెత్తి నమస్కరించాలని రోజా అన్నారు.
దేశంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు పెరిగిపోయాయని ఆమె అన్నారు. మద్యం మత్తులో వావివరసలు కూడా మరచి కొంతమంది అత్యాచారాలకు పాల్పడుతుండడాన్ని రోజా ఖండించారు.