బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీడీపీ అనైతిక విధానాలకు నిరసనగా వాకౌట్
20 Oct 2016 4:48 PM
నరసరావుపేట రూరల్ః మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నుంచి వైయస్సార్సీపీ వాకౌట్ చేసింది. ఎజెండాకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీర్మానం చేశారు. అధికార పార్టీ మోసాలు, ప్రలోభాలకు నిరసనగా పార్టీ ఎంపీటీసీలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను అనేక విధాలుగా టీడీపీ నేతలు ప్రలోభపెడుతున్నారని, కేసులు పెడతామని బెదరిస్తున్నారని ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. డబ్బులు, పనులు, ఉద్యోగాలు ఆశ చూపుతున్నారని ఫైరయ్యారు.
టీడీపీ అనైతిక వ్యవహారాలకు నిరసనగానే సమావేశం నుంచి వాకౌట్ చేసినట్టు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 13వ ఫైనాన్స్ నిధులు ఎంపీటీసీలు అందరికి సమానంగా ఇస్తామంటే మా సభ్యులు ఎక్కువ మంది ఉన్నా అంగీకరించామన్నారు. కాని అధికార పార్టీ తామే చేసుకుంటామని మోసానికి పాల్పడిందన్నారు. తమ సహకారంతో గెలుపొందిన వ్యక్తి పార్టీ మారి ఈ విధంగా చేయడం దారుణమన్నారు.